పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ముఖ్య అతిథిగా హాజరై అనాథాశరణాలయాన్ని ప్రారంభించారు.
సమాజ సేవా దృక్పథంతో శ్రీ కరుమంచి జీవరత్నం గారు, శ్రీమతి కరుమంచి రత్న కుమారి గారు స్థాపించిన ఈ సేవా సంస్థ అనాథలు, వృద్ధు మరియు నిరాశ్రయులకు ఆశ్రయంగా నిలవనుంది.
ఈ సందర్భంగా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడుతూ, సమాజంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సేవాభావంతో ముందుకు వస్తున్న దాతలను అభినందిస్తూ, వారి సేవా స్పూర్తి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.










