గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై
మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి,అజయ్ కుమార్, ఇతర అన్ని శాఖల అధికారులు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పగించామో వాటన్నింటినీ ఇచ్చిన సమయంలోపు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. అదేవిధంగా అక్కడ పారిశుద్ధ్య పనులు, స్టాల్స్ ఏర్పాట్లు,ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.ముఖ్యంగా సభా ప్రాంగణం పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అందరు అధికారుల సహకారంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందని తెలిపారు.









