*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*
అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువనాయకులు మౌర్యా రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో బీఎల్వో తులసి రెడ్డితో కలిసి సర్ సర్వే కార్యక్రమంలో రంజిత్ రాయల్ పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సర్వే ప్రధాన ఉద్దేశ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటర్లకు ఒకే ఫోటోతో ఉన్న రెండు దరఖాస్తు పత్రాలను అందజేసి, వాటిలో తమ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసి తిరిగి అందజేయాలని బీఎల్వో తులసి రెడ్డి సూచించారు.ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను సరిదిద్దడంతో పాటు ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించేందుకు ప్రజలు సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని రంజిత్ రాయల్ కోరారు……..










