మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యల మాదిరిగానే జిల్లాల విభజనలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలను తిరిగి కలపాలని సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. తాను అధికారంలో ఉంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునేవాడినని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా 1858లో ఏర్పడిన మదనపల్లె సబ్ డివిజన్ కంటే చిన్నదిగా ఉందని అభిప్రాయపడ్డారు.









