జనసేన పార్టీ ప్రకటించిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలలో మదనపల్లెకు చెందిన జనసేన నాయకురాలు దారం అనితకు రాజంపేట పార్లమెంట్ సీనియర్ నాయకురాలిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కమిటీలను నియమించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి శతకోటి వందనాలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు









