అన్నమయ్య జిల్లాలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపారు. మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువతలో అవగాహన కోసం అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి, మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.









