“వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం ఆల్వాల్ ల్లో మొక్కల నాటడం, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులకు మొక్కలను పంపిణీ చేసి పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
వనమహోత్సవం కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, డీసీ భోగేశ్వర్, హార్టికల్చర్ అధికారులు అనిల్, నవీన్, భాస్కర్, శ్రీధర్ గౌడ్, అరుణ్, సాజిద్, ప్రేమ్, ప్రశాంత్, మహేందర్, హనుమంత్, మహేష్, గిరి, సందీప్తో పాటు కాలనీ సభ్యులు దివాకర్ రెడ్డి, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal









