పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. డాక్యుమెంట్లు లేకుండా లేదా గడువు ముగిసిన పత్రాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి.










