మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.|

0
0

మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా సహకారం కీలకమని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. గంజాయి, అక్రమ మద్యం, ఎర్రచందనం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, బాలబాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ తెలిపారు.