మంగళవారం రాయచోటి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పుంగనూరు గాంధీనగర్ కు చెందిన జబిఉల్లా (18)ను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రాయచోటి నుంచి పుంగనూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది# కొత్తూరు మురళి .









