పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ, కరకమంద గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పుంగనూరు నుంచి తిరుపతికి వెళుతున్న కారు అతివేగం వెళుతున్న కారణంగా మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది# కొత్తూరు మురళి .








