మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.|

0
0

మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఐసీయూ, ట్రామాకేర్ సేవల లోపాలు, రోగులను తరచూ ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.