కష్టకాలంలో చేయూత.. లబ్ధిదారులకు చెక్కులు.|

0
5

“రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 53 మందికి రూ.21.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal