విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|

0
4

“ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొన్న నితిన్ నబీన్, రామచందర్ రావు, ఈటల రాజేందర్.”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

కళాశాల ప్రాంగణంలో వారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అనంతరం నిర్వహించిన ‘వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్’ కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభను దేశ ప్రగతికి వినియోగించడంతో పాటు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

#Sidhumaroju