Gachibowli gmc balayogi stadium ruby|

0
0

గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబయ్ డ్రీమర్స్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో 41-17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది.

 

🏉 ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారితో పాటు సినీనటుడు కొణిదెల చిరంజీవి గారు, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్, నటుడు రాహుల్ బోస్ గారు, జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ గారు, క్రీడాకారిణి పీవీ సింధు గారు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ కె. శివసేనా రెడ్డి గారు, నటి మృణాల్ ఠాకూర్ గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరై వీక్షించారు.

 

🏉 అనంతరం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మన్యుయెల్ మొరెనోకు హెచ్ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ -2026 కప్‌ను అందజేశారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన రగ్బీ ప్రీమియర్ సీజన్ -2 పోటీలు ఈరోజు జరిగిన తుదిపోరుతో ముగిశాయి.