హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా పెరిగిపోవడం, వారికి అనుగుణంగా వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, స్కైవేలు నిర్మిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి
ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ఆ రోడ్డును అధికారులు 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.










