ప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రతి కుటుంబానికి భరోసా|

0
0

ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం

ముండ్లమూరు మండలం చంద్రగిరి గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల ఒకటో తేదీన అవ్వాతాతలకు పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా దర్శి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి చేరుకుని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు హామీ ఇచ్చారు.