టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం:
ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు;
…కర్మ రిటర్న్-ఎమ్మెల్యే గళ్ళా మాధవి!
గుంటూరు(ప్రజా పక్షమే -నా గళం):ఏడుకొండల స్వామికి తలనీలాలు సమర్పిస్తే వైసీపీ సోషల్ మీడియాలో అవమానకర పోస్ట్ లు వ్యాఖ్యలు చేయడం పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సీరియస్ అయ్యారు.మహిళలంటే మొదటి నుంచి వైసీపీకి చులకన భావమని మండిపడ్డారు.గతంలో సియం తల్లి పైన నారా లోకేష్ మదర్ పైన హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పిల్లలు మీద సోషల్ మీడియాలో దూషణలు చేయడం వైసీపీ నైజమన్నారు.గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పై వికృత భాషను ప్రోత్సహించడం జగన్ కే చెల్లిందన్నారు.మహిళా ఎమ్మెల్యేలు మీద పబ్లిక్ గా హేయమైన భాషతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సొంతింటి మహిళలకు విలువ ఇవ్వలేని నాయకుడు జగన్…ఇక ఆయన కింద పని చేసే నేతలు మహిళలకు ఏం గౌరవిస్తారు.మేకప్ హైట్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మహిళలు సైలెంట్ గా ఉండరు… మిమ్మల్ని ముంచేస్తారని హెచ్చరించారు.ఈసారి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు.హోంమంత్రి అనిత పై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మహిళా నాయకురాళ్లతో పాటు జగన్ సమర్ధించడాన్ని తప్పుబట్టారు.కర్మ రిటర్న్ తధ్యమన్నారు.హోంమంత్రి అనితకు అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియా ద్వారా రౌడీయిజం చేసే వారికి మరోక అవకాశం ఇస్తే పరిస్దితి మరింత భయానికంగా ఉంటుంది.ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అని ప్రశ్నించారు.










