దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం…
ఈరోజు మార్కాపురంలో ఎమ్మార్పీఎస్ (MRPS) అనుబంధ సంఘాలైన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF), మహాజన సోషల్ పార్టీ (MSP), దళిత క్రిస్టియన్ ఐక్యవేదిక ప్రతినిధులు మరియు స్థానిక చర్చి పాస్టర్లు నన్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ భేటీలో MEF జాతీయ అధ్యక్షులు బొంత ఏసుదాసు గారు, రాష్ట్ర అధ్యక్షులు బిక్షాలు గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి ఐజాక్ గారు, MSP జాతీయ ఉపాధ్యక్షులు ఎలగంటి నర్సింగ్ గారు, ఇతర ముఖ్య నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గతంలో (01-07-2026న) చారిత్రాత్మక ఏబీఎం (ABM) హైస్కూల్ భూములను ఆక్రమణల నుండి కాపాడి, తిరిగి పాఠశాలను విజయవంతంగా ప్రారంభించేలా ప్రభుత్వం ద్వారా తీసుకున్న చొరవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దళిత, క్రైస్తవ సోదరులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని తెలియజేశాను. సమాజంలోని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చాను.










