శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాదాపు 120 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి,వారికి కావలసిన మాత్రలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తరుణ్, అఖిల,సర్పంచ్ నూనె దివ్య తిరుపతి,ఉప సర్పంచ్ మసికే కుమారస్వామి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.










