మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,
ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు.ఈ సందర్భంగా హాస్పిటల్ లోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.రోగులను ఆప్యాయంగా పలకరించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అదేవిధంగా అక్కడ డయాలసిస్,థైరాయిడ్ పరీక్ష కోసం తీసుకువచ్చిన మెషిన్ వంటివాటి గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రోగులకు అందిస్తున్న మెనూ,మందుల స్టాక్ రూములను పరిశీలించారు.










