“అల్వాల్ పోలీసుల చాకచక్యం.. క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగింత”
మేడ్చల్ మల్కాజిగిరి జూలై 11: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 10 ఏళ్ల బాలుడిని అల్వాల్ పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాలుడి తల్లి పోతుగంటి సుమిత్ర ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 687/2026 కింద కేసు నమోదు చేశారు.
ఎస్హెచ్వో ప్రశాంత్ సూచననల మేరకు సబ్ఇన్స్పెక్టర్ తరుణ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఏఎస్ఐ తులసీరామ్, పీసీ సుధాకర్, పెట్రోలింగ్ సిబ్బంది, రాత్రంతా విస్తృతంగా గాలింపు నిర్వహించగా, శనివారం ఉదయం బాలుడిని క్షేమంగా గుర్తించారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాలుడి ఆచూకీ కోసం శ్రమించిన పోలీసు బృందాన్ని స్థానికులు అభినందించారు.
#Sidhumaroju
Alwal










