“షాబాద్ ఘటన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి.. గోప్యతకు హామీ ఇచ్చిన ఫ్యూచర్ సిటీ పోలీసులు”
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జూలై జూలై 11:- షాబాద్ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు పి. రాజ్కుమార్ను పట్టుకునేందుకు దోహదపడే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రకటించారు.
నిందితుడి ఆచూకీ, సంచారం లేదా అరెస్టుకు నేరుగా దారితీసే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి ఈ నగదు రివార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, పి. రాజ్కుమార్ ఆరు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితుడి అరెస్టులో ప్రజల సహకారం అవసరమని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సమాచారం అందించే వ్యక్తుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, వారి భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఫ్యూచర్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి గురించి సమాచారం తెలిసిన వారు చవేళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా +91 8712665324 వాట్సాప్ హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు.
#sidhumaroju










