“కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం”
మేడ్చల్ మల్కాజ్గిరి జులై 13: ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో రూ.51 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు.
కాలనీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు వినతి మేరకు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చేసిన ప్రతిపాదనతో ఈ సీసీ రోడ్ల పనులకు రూ.51 లక్షల నిధులు మంజూరై పనులు ప్రారంభమైనట్లు స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావుతో పాటు భాస్కర్ గౌడ్, నారాయణప్ప, రవి, జైపాల్ రెడ్డి, శివరాజ్, నాగన్న, రాము, మనోహర్ రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజ్ పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ-బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, జిల్లా కార్యదర్శి భబిత, సూర్యకిరణ్, బలవంత్ రెడ్డి, కృష్ణ గౌడ్, లావణ్య, సుకన్య, అశోక్, దేవేందర్, ప్రవీణ్, మధుసూదన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తోట లక్ష్మీకాంత్ రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.
#Sidhumaroju
Alwal










