భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.|

0
2

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన సీతారామయ్య అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన దాయాదులు జరిపిటి సుధాకర్, అతని కుమారుడు మంజునాథ్ ఇరువురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి వృద్ధుడిని గాయపరిచారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పొలంకు దారి హద్దుల సర్వే చేస్తున్న తరుణంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి 108 సహాయంతో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తంబళ్లపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.