టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్|

0
3

జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సారిపల్లి, సోనియానగర్, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం టిడ్కో కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. సోనియానగర్లో తాగునీటి పథకం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. #Boiena Ranesh