జిల్లా విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి|

0
1

యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఉదయ, రంగప్ప డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించడంతో పాటు రాయలసీమ, ఉర్దూ, క్లస్టర్ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంతంలో విద్యార్థుల వలసలను నివారించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించాలని కోరారు. అలాగే ఆలూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం, బీసీ ప్రీమియర్ హాస్టళ్లు ఏర్పాటు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రాము, జిల్లా కమిటీ సభ్యుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.