పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని మినికి ఆంజనేయస్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాయి తేజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి .










