సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన|

0
1

జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్‌ జోన్‌ రోడామిస్త్రీనగర్‌లో బుధవారం వన్‌డే-వన్‌వార్డ్‌లో భాగంగా కాలనీల ప్రజలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీసలబస్తీ, శ్రీనివాసనగర్‌ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌, భగత్‌సింగ్‌మార్గ్‌ ప్రాంతాల్లో రోడ్డు నిర్మించాలని పలువురు కోరారు. జగద్గిరిగుట్ట ఔట్‌పోటస్ట్‌ వద్ద సిగ్నల్‌, చైతన్య విద్యానికేతన్‌ చౌరస్తా, మఖ్థూంనగర్‌ మసీద్‌ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌లో వీధి దీపాలు, హైమాస్‌లైట్లు ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు