జగద్గిరిగుట్టలో భక్తి వెల్లువ.. బోనాల పండుగ వైభవం.|

0
4

● అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

● తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాలు ప్రతీక: ఈటల

మేడ్చల్ మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట, ఆగస్టు 9: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు జగద్గిరిగుట్టలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని సంజయ్‌పురి కాలనీ, అంజయ్యనగర్‌లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

జగన్మాత దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సకల సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జేకే శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు కంచి మహేందర్ యాదవ్, సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal