కొడవళ్ళతో దాడి|

0
2

మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు వస్తుండటంపై భాస్కర్ వారిని ప్రశ్నించగా, ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. మాటమాట పెరగడంతో ప్రత్యర్థులు కొడవలితో ఒక్కసారిగా భాస్కర్‌పై దాడి చేశారు. ​ఇంటి స్థలాల విషయంలో గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే, ఆ పాత కక్షలను మనసులో ఉంచుకుని ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు భాస్కర్ ఆరోపిస్తున్నారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ను స్థానికులు వెంటనే నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.