బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన|

0
18

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మురుమురం రాజు, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలను చేతబూని ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కోట్నాక్ విజయ్, పేర్ల మురళీధర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.