5వ డివిజన్లో రూ. 1 కోటి ‘పబ్లిక్ హెల్త్’ నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ డివిజన్ పరిధిలోని గూడెం నుండి రామాలయం వీధి వరకు పబ్లిక్ హెల్త్ (Public Health) రూ. 1 కోటి నిధులతో మంజూరైన నూతన రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ…“మన డివిజన్ పరిధిలోని గూడెం నుండి రామాలయం వీధి వరకు ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ హెల్త్ నిధుల నుంచి రూ. 1 కోటితో ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన డివిజన్లో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి. రాజకీయాలకు, ఎటువంటి పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి మన డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.
ప్రత్యేక ధన్యవాదాలు:
ఈ నిధుల మంజూరుకు, డివిజన్ అభివృద్ధికి సహకరించిన
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి,
రూరల్ శాసనసభ్యులు శ్రీ భూపతి రెడ్డి గారికి,
మున్సిపల్ కమిషనర్ గారికి
మరియు పబ్లిక్ హెల్త్ అధికారులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.










