జిల్లాలో వివిధ పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్లో APIIC ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టుల వారీగా భూముల సేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలపై ఆరా తీశారు. భూ యజమానులకు చట్టప్రకారం పరిహారం అందించాలని సూచించారు.
#RAJESH










