తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూషను పోటీ చేయించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఏ విధానంలో జరిగినా ఆమెను బరిలోకి దింపుతానని మీడియాతో చిట్చాట్లో స్పష్టం చేశారు. కుమార్తెను తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దే దిశగా బొత్స ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.










