AP: విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 629 ఉద్యోగాలకు లక్షమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షలు పారదరర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి దుష్ప్రచారాలు, వదంతులను నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










