రాజాం పట్టణంలోని ఎల్లయ్య నగర్కు చెందిన అరసాడ యువరాజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో టైపిస్ట్ ఉద్యోగం సాధించారు. రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న ఆయన, తండ్రి మరణం తర్వాత తల్లి లక్ష్మి పట్టణంలో కూరగాయల వ్యాపారం చేస్తూ కష్టపడి చదివించారు. ప్రభుత్వ కొలువు సాధించిన యువకుడిని పలువురు అభినందిస్తున్నారు.










