కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని ఎస్ఐ పి.నారాయణరావు సూచించారు.










