● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన ఎమ్మెల్యే
● సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని పిలుపు
అల్వాల్, ఆగస్టు 26: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్లో జష్న్-ఎ-మిలాద్-ఉన్-నబీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్థానిక బిఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముస్లిం పెద్దలు, యువత ఆయనకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముస్లిం సోదర సోదరీమణులకు జష్న్-ఎ-మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యతతో మెలుగుతూ పరస్పర గౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు.
మల్కాజ్గిరి ప్రాంతం సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మచ్చబొల్లారం మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, శోభన్ బాబు, భాస్కర్ రెడ్డి, అతిక్ పాషా, మహేష్, సురేష్, జనార్ధన్, సాజిద్, వెంకటేష్, గణేష్తో పాటు స్థానికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










