వెంకటాపురం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు|

0
5

భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ మాటేటి రవి మరియు వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శి యాదగిరి గారు కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు మరియు పిఎసిఎస్ డైరెక్టర్లు ఏడాకుల రమణారెడ్డి రాజు గారు పాల్గొన్నారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము