రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 606 కేజీలు రేషన్ బియ్యం.
79 ప్యాకెట్లు (39.50 కేజీలు) పంచదారను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి, పట్టుకున్న సరుకును రేషన్ దుకాణానికి అప్పగించామని తహశీల్దార్ తెలిపారు.










