శ్రీవారి భక్తుల కోసం వరల్డ్ క్లాస్ ఎస్వీ మ్యూజియం|

0
2

తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

మ్యూజియంలోని అన్ని విభాగాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. మ్యూజియం నిర్వహణకు సంబంధించి టీసీఎస్‌ బృందానికి కూడా అవసరమైన సూచనలు అందించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెంకయ్య చౌదరి దిశానిర్దేశం చేశారు.