మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్

0
3

మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్, డా. ఎగ్గెన శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో హిందూ సేవా సమితి అధ్యక్షులు బండవరపు జగన్తో పాటు నవీన్, రాజేష్, రఘు, సంతోష్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు, హిందూ బంధువులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. నిమజ్జనం సందర్భంగా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.