మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’ కీలకమని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీఎస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో డీసీపీ శ్రీధర్ వివరించారు.
ఈ కార్యక్రమాన్ని మారేడ్పల్లి ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల సహకారం, వేగవంతమైన స్పందన వల్లే ప్రమాదాల్లో మరణాల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు.
రోడ్డు భద్రతపై మరింత చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.
#sidhumaroju










