భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రకం వడ్లకు బీరకం ధర చెల్లిస్తామని మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు విలేకరులతో మాట్లాడారు వరి ధాన్యానికి ఏ గ్రేడ్ అని సర్టిఫికెట్ ఇచ్చి రైస్ మిల్లుకు తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసిన తర్వాత .
బి గ్రేడ్ కిందనే డబ్బులు వేస్తామని అంటున్నారు రైస్ మిల్లర్లు ప్రతి సెంటరు తిరుగుతూ మీరు బి గ్రేడ్ గానే సర్టిఫైడ్ చేయాలని సెంటర్ ఇన్చార్జిలను ఇబ్బంది పెడుతున్న వైనం మండలంలోని కొనుగోలు కేంద్రాలలో నడుస్తుందన్నారు ఆరుగాలం కష్టపడిన అన్నదాతను ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు వెంటనే జిల్లా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు కెసిఆర్ పరిపాలనలో రైతులకు స్వర్ణ యుగముల ఉండేది అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదు అన్నారు










