మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలను ఘనంగా ప్రారంభించారు.
విధుల్లో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మహిళా మరియు పురుష సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన విశ్రాంతి గదులను ఆయన ప్రారంభించారు.
వీటితో పాటు రికార్డుల భద్రత కోసం ఏర్పాటు చేసిన కోర్ట్ రికార్డు గదిని, సిబ్బంది శారీరక దృఢత్వం కోసం నిర్మించిన షటిల్ కోర్టును కూడా ఆయన ఆవిష్కరించారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం మరియు వాటర్ ఫ్రిడ్జ్ సౌకర్యాలను డీసీపీ అభినందించారు.
ఈ సందర్భంగా స్టేషన్లోని సీడీ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, కేసుల పురోగతిపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగి రెడ్డి, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ నర్సింహారావు, సూరారం ఎస్హెచ్ఓ సుధీర్ కృష్ణ తో పాటు ఎస్సైలు మురళి గౌడ్, కృష్ణ, రాజు, కిషన్, ఏఎస్సై శ్రీనివాస్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#sidhumaroju










