పుంగునూరు పట్టణ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు అమ్మవారికి ఉదయం నదీ జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేసి, అనంతరం పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు# కొత్తూరు మురళి .










