“దుండి రాకేశ్ పై దాడి అమానుషం: నిందితులను కఠినంగా శిక్షించాలని దోగుపర్తి బాలకృష్ణ డిమాండ్!”

0
6

గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.రాజకీయాల్లో విభేదాలు ఉండటం సహజమని, అయితే వాటిని హింస ద్వారా వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలనిఎలాంటి అసంతృప్తి ఉన్నా ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.దాడులు, బెదిరింపులు వంటి హింసాత్మక చర్యలు రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తాయని, ఇటువంటి ఘటనలు సమాజంలో అశాంతికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దోగుపర్తి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

దుండి రాకేశ్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

అసంతృప్తి ఉంటే ఓటు ద్వారా చూపాలి, హింస ద్వారా కాదు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని దోగిపర్తి బాలకృష్ణ తెలిపారు.