అన్నమయ్య జిల్లా మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, వడ్డెర సంఘం అధ్యక్షుడు దేవల మురళికి సోమవారం ఘన సన్మానం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రెండోసారి నియమితులైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వడ్డెర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు





