తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు…..

0
5

50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

తగ్గిన ఎండ తీవ్రత…

43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు..

భారత్ ఆవాజ్ న్యూస్: వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో పాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదని, పాత షెడ్లలో, గోడల పక్కన నిలబడరాదని ఎక్స్పర్ట్స్్సూచిస్తున్నారు.